మారేడ్పల్లి : రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దయానంద్నగర్-మౌలాలి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తలిరంచారు. మృతుని వయసు సూమారు 45-50 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. మృతుని సంబంధీకులు ఏవరైనా ఉంటే రైల్వే పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.