కాచిగూడ : పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఫలక్నామాలోని ఫాతిమానగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ షరీఫ్ (35)ఆదివారం ఫలక్నామా-బుద్వేల్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో షరీఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.