కాచిగూడ : ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అజయ్ (25), మరో వ్యక్తి(35) ఫుట్పాత్ పై నివాసముంటూ బిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు.
వీరు శుక్రవారం సాయంత్రం అతిగా మద్యం సేవించి ఇద్దరు తోపులాటుకుంటుండగా కాచిగూడ రోడ్డులో ఎదురుగా వస్తున్న కుషాయిగూడ డిపోకు చెందిన ఏపీ 28 జెడ్ 1933 నెంబర్ గల ఆర్టీసీ బస్సు కింద ప్రమాధవశాత్తు పడి 35 సంవత్సరాల వ్యక్తి మృతిచెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.