లక్నో : చీటికిమాటికి చిన్న కారణాలకే ఆంటీని, కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడనే ఆగ్రహంతో యువకుడు తన మామను హత్య చేసిన ఘటన యూపీలోని ప్రతాప్ఘఢ్లో వెలుగుచూసింది. నిందితుడిని సూరజ్ కుమార్గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జితేంద్ర కుమార్ అలియాస్ సునీల్ డిసెంబర్ 24న కాలువ వద్ద శవమై తేలాడు. హంతకుడు సునీల్ గొంతు పిసికి అంతమొందించాడు. దర్యాప్తులో భాగంగా సూరజ్ ఈ నేరానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. హత్య అనంతరం టౌన్ విడిచి పారిపోతుండగా సూరజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
చిన్న చిన్న కారణాలకే ఆంటీని, ఇతర కుటుంబసభ్యులను వేధిస్తున్నాడనే కోపంతోనే ఈ నేరానికి పాల్పడ్డానని నిందితుడు అంగీకరించాడు. ఆంటీతో మాట్లాడకుండా తన మామతో పాటు తాత అడ్డుకునేవారని నిందితుడు చెప్పాడు.