జహీరాబాద్, ఫిబ్రవరి 19 : జహీరాబాద్ పట్టణంలో ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని పత్రు నాయక్ తండ శాంతినగర్ లో నివసిస్తున్న అక్షయ్ రాథోడ్(23) ఆదివారం రాత్రి తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. మృతుడి ఒంటిపై ముఖంపై గాయాలు ఉన్నాయి.
అక్షయ్ రాథోడ్ భార్య ఏడాది నుంచి భర్తకు దూరంగా తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. అప్పటి నుంచి మృతుడు అక్షయ్ తన తల్లితో శాంతి నగర్ లోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.