పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బొల్లి రాజ మల్లయ్య (48) అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ తో మరణించాడు. రాజ మల్లయ్య గత కొన్ని సంవత్సరాలుగా ధర్మారం మండల కేంద్రంలో చేపల దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు.అతడికి జూలై నెలలో కరోనా సోకడంతో కోలుకున్నాడు.
అనంతరం రాజ మల్లయ్యకు బ్లాక్ ఫంగస్ సోకడంతో కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్ లోని గాంధీ దవాఖానకి తరలించారు. ఫంగస్తో అతని ఎడమ కన్నును కోల్పోయాడు. గత 15 రోజుల నుంచి దవాఖాన లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మరణించాడు.