జైపూర్ : వివాహితతో అక్రమ సంబంధం ప్రాణాలను బలిగొన్నది. భార్యను, ఆమె ప్రియుడిని భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అతన్ని నుంచి తప్పించుకునేందుకు ఐదో అంతస్తు నుంచి ప్రియుడు కిందకు దూకాడు. ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్కు చెందిన మోషిన్(29).. ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె తన భర్తను వదిలేసి.. మోషిన్తో కలిసి కాపురం పెట్టింది. రెండేండ్ల క్రితం తన కూతురిని తీసుకుని నైనిటాల్ వెళ్లింది. అక్కడే మోషిన్తో కలిసి ఉంటోంది. ఈ విషయం తన భర్తకు తెలియడంతో.. అక్కడ్నుంచి జైపూర్కు మకాం మార్చారు. అయినప్పటికీ వీరిని ఆమె భర్త వదల్లేదు. ఆదివారం రోజు.. జైపూర్లో ఉంటున్న భార్యను, మోషిన్ను రెడ్ హ్యాండెడ్గా భర్త పట్టుకున్నాడు.
అతన్ని నుంచి తప్పించుకునేందుకు మోషిన్ తాను ఉంటున్న ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడు. ప్రాణప్రాయస్థితిలో ఉన్న మోషిన్ను ఆ మహిళ ఎస్ఎంఎస్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. అయితే మోషిన్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ పరారీ అయింది. ఈ దంపతుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.