నిర్మల్ : జిల్లాలోని కడెం మండలం దోస్త్ నగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉట్నూర్ మండలం నీలాగొందికి చెందిన సూర్యారావు(25) అటవీ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తుండగా వెనకాల నుండి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో సూర్యారావు బైక్పై నుంచి ఎగిరి చెట్టుకు వేలాడగా తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.