అమరావతి : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం-జాడుపుడి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడుని కవిటి మండలం జమేదారుపుట్టుగకు చెందిన నాగలి కృష్ణా రావు(34)గా గుర్తించారు. బహిర్భూమికి వెళ్లగా రైలు ఢీకొన్నట్లు పలాస జిఆర్పీ పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.