మెదక్ : ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దశంకరంపేట మండలం గొట్టిముక్కుల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టిముక్కుల గ్రామానికి చెందిన వడ్ల ప్రశాంత చారి (30) తన వ్యవసాయ పొలం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్నాడు.
అటువైపు వెళ్తున్న స్థానికులు 108కి సమాచారం అందించారు. ప్రశాంత చారిని అంబులెన్స్లో జోగిపేట దవాఖానకు తరలిస్తుండగా మార్గమద్యంలో చనిపోయాడన్నారు. ప్రశాంత చారికి మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా, గత 8 నెలల క్రితం భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారన్నారు.
అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురైన ప్రశాంత చారి ఈ క్రమంలో పొలం వద్ధ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.