Sangareddy | సంగారెడ్డి : జిల్లా పరిధిలోని గుమ్మడిదల( Gummadidala ) శివారులో ఉన్న పంట పొలాల్లోకి ఓ వ్యక్తి వెళ్లాడు. అక్కడున్న స్టార్టర్లు, విద్యుత్ తీగలను( electricity wires ) చోరీ చేసేందుకు దొంగ( Thief ) యత్నించాడు. అక్కడే ఉన్న రైతులు( Farmers ) దొంగను గమనించి అదుపులోకి తీసుకుని, దేహశుద్ధి చేశారు.
ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకోగా, దొంగను కొట్టుకుంటూ రైతు సంఘం కార్యాలయానికి తరలించారు. రైతుల చేతిలో దెబ్బలు తిన్న దొంగ కాసేపటికే మృతి చెందాడు. ఈ ఘటనపై గుమ్మడిదల పోలీసులు( Police ) కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడిని మల్లేశ్(29 )గా పోలీసులు గుర్తించారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.