జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గణపురం మండలం మైలారం తండాలో చోటు చేసుకుంది. మైలారానికి చెందిన చాపర బోయిన శివ కుమార్(44) బుధవారం రాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు.
గురువారం ఉదయం మైలారం పక్కనే ఉన్న తండాలోని అలోత్ పాపయ్య ఇంట్లో రక్తపు మడుగులో విఘత జీవై కనిపించాడు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, చిట్యాల సీఐ పులి వెంకట్, గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ ఘటన స్థలానికి చేరుకొని వ్యక్తి మృతికి కారణాలపై ఆరా తీస్తున్నారు.
మర్డరా లేక ఇంకేదైనా కారణామా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.