బంజారాహిల్స్: నిషేదిత గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనంప్రకారం బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లోని సయ్యద్నగర్లో నివాసముంటున్న షేక్ సయిదుల్ హుస్సెన్ అలియాస్ సూరజ్ (31) డిజైనర్గా పనిచేస్తున్నాడు.
డబ్బులు త్వరగా సంపాదించాలనే ఉద్ధేశ్యంతో కొంత కాలంగా దూల్పేట నుంచి గంజాయి కొనుగోలుచేసి స్థానికంగా విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 32 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.