ముంబై : మహారాష్ట్రలోని థానే జిల్లాలో 40 ఏండ్ల వ్యక్తి ఓ మైనర్ బాలిక(14)ను అపహరించి ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. భివాండి తాలూకాలో ఆదివారం ఈ ఘటన జరగ్గా గురువారం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్ఘర్ జిల్లాకు చెందిన బాలిక తల్లితండ్రులు ఇటుక బట్టీలో పనిచేస్తుంటారు. నిందితుడి ఇంట్లో బాలిక పనిచేస్తోందని పోలీసులు చెప్పారు. ఇక బాలికను ఆదివార పాల్ఘర్లోని తన తల్లితండ్రుల వద్దకు తీసుకువెళతానని నమ్మబలికిన నిందితుడు బైక్పై ఆమెను ఎక్కించుకుని వెళ్లాడు.
వారు అనగాం ప్రాంతానికి చేరుకున్న క్రమంలో బాలికను లాడ్జికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించగా తీవ్రంగా కొట్టిన నిందితుడు ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడు. బాలికను ఆమె ఇంటివద్ద నిందితుడు విడిచిపెట్టగా జరిగిన విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.