నర్సంపేట రూరల్, జూన్ 7: మండలంలోని అన్ని గ్రామాల నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఈజీఎస్ ఈసీ అరుణ్కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని గురిజాల, గుంటూరుపల్లి, ముగ్ధుంపురం, చిన్న గురిజాల గ్రామాల్లోని నర్సరీలను అరుణ్ కుమార్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కలుపు మొక్కలను తొలగించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు గొడిశాల మమత, కర్నాటి పార్వతమ్మ, పెండ్యాల జ్యోతి, గడ్డం సు జాత, టీఏలు భద్రు, వెంకటేశ్వర్లు, ఉపేందర్ పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత : ఏపీడీ
దామెర : మొక్కల సంరక్షణ అందరి బాధ్యతని ఏపీడీ వసుమతి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని యాదాద్రి ప్లాంటేషన్, నర్సరీ కేంద్రం, ఈజీఎస్ పనులను ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వసుమతి మాట్లాడుతూ వర్షాకాలంలో రోడ్లకు ఇరు వైపులా, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటాలని ప్రభు త్వం ఆదేశించిందన్నారు. ఈజీఎస్ పనులను కూలీలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో యాదగిరి, పంచాయతీ కార్యదర్శి నరేశ్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.