అబిడ్స్ : హోటల్ వ్యాపారంలో నష్ట పోయిన ఓ వ్యక్తి సులువుగా డబ్బు సంపాదించేందుకు క్రికెట్ బెట్టింగ్ను ఎంచుకుని పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిలావర్గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎన్ రవి కథనం ప్రకారం….
అప్పర్ ధూల్పేట్ ప్రాంతానికి చెందిన దాల్వాలే భగత్సింగ్ (40) హోటల్ వ్యాపారాన్ని నిర్వహించే వాడు. వ్యాపారంలో నష్టం రావడంతో క్రికెట్ బెట్టింగ్ను ఎంచుకున్నాడు. దిలావర్గంజ్ ప్రాంతంలో సెల్ ఫోన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు.
బుధవారం జరిగిన బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అతని నుంచి స్మార్ట్ సెల్ఫోన్తో పాటు 95, 500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును మంగళ్హాట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.