మహారాష్ట్ర : భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కలిగిఉందనే అనుమానంతో భార్యతో పాటు అత్తపై పదునైన ఆయుధంతో దాడి చేసిన వ్యక్తి ఉదంతం మహారాష్ట్రలోని పుణే చించ్వాద్ ప్రాంతంలో వెలుగుచూసింది. నిందితుడిని చించ్వాద్ ప్రాంతంలోని వల్హేకర్వాది కాంప్లెక్స్కు చెందిన సుభాష్ గైక్వాడ్గా గుర్తించారు.
నిందితుడి భార్య రూపాలి, అత్త మంగళ్ ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకు సుభాష్ గైక్వాడ్ ఆగ్రహంతో ఊగిపోతూ ఇంటికి చేరుకుని పదునైన ఆయుధంలో భార్య, అత్తపై దాడి చేసి ఆపై పరారయ్యాడు. మహిళల అరుపులు విన్న స్ధానికులు ఘటనా స్ధలానికి చేరుకోగా వారు రక్తపు మడుగులో పడిఉన్నారు.
ఇద్దరు మహిళలను స్దానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా ప్రస్తుతం వారి పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న సుభాష్ను చించ్వాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూపాలి వేరొకరితో వివాహేతర సంబంధం కలిగిఉందనే అనుమానంతోనే ఆమెపై నిందితుడు దాడికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.