న్యూఢిల్లీ : ఆన్లైన్ వేదికగా సైబర్ నేరస్తులు (Cyber Crime) చెలరేగుతూనే ఉన్నారు. అదనంగా కొంత డబ్బు ఆర్జించేందుకు బాధితుడు ఆన్లైన్లో వర్క్ ఫ్రం హోం జాబ్కు దరఖాస్తు చేయగా ఆపై ఓ లింక్ క్లిక్ చేయడంతో భారీ మొత్తం కోల్పోయాడు. ఢిల్లీకి చెందిన హరిన్ బన్సల్ ఇటీవల ఇంటర్నెట్లో ఇంటి నుంచి పనిచేస్తూ భారీ మొత్తం ఆర్జించవచ్చనే ప్రకటన చూసి పోస్ట్పై క్లిక్ చేయడంతో అది నేరుగా ఓ వ్యక్తికి చెందిన వాట్సాప్ నెంబర్కు రీడైరెక్ట్ చేసింది.
ఆపై తాము పంపే వెబ్సైట్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గుర్తుతెలియని వ్యక్తి బాధితుడిని కోరాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ముందుగా తాము ఇచ్చిన టాస్క్ పూర్తిచేయాలని వెబ్సైట్ కోరింది. ఈ ప్రక్రియలో భాగంగా కొంత మొత్తం డిపాజిట్ చేసి ఆపై విత్డ్రా చేయాలని దీనిపై కమీషన్ కూడా ఇస్తామని పేర్కొంది. తొలుత బాధితుడు బన్సల్ కొంత మొత్తం డిపాజిట్ చేసి విత్డ్రా చేయగానే కమీషన్ కూడా ముట్టచెప్పారు.
బాధితుడిని నమ్మకాన్ని చూరగొన్న స్కామర్లు మరింత మొత్తం డిపాజిట్ చేయాలని సూచించారు. దీంతో బన్సల్ ఏకంగా రూ . 9.32 లక్షలు డిపాజిట్ చేయగా ఈ మొత్తం విత్డ్రా చేయడం సాధ్యం కాలేదు. తాను మోసపోయానని గుర్తించిన బన్సల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులు అంకిత్ (30), సుధీర్ కుమార్ (45)లను అరెస్ట్ చేశారు.
Read More :
Salman Khan | సల్మాన్ను చంపేస్తామంటూ బెదిరింపులు.. నటుడి ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం