భోపాల్: పాస్బుక్ కోసం లంచం అడిగిన బ్యాంక్ ఉద్యోగిని రైతులు కొట్టారు. మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో ఈ ఘటన జరిగింది. పాస్బుక్ల జారీ కోసం బ్యాంక్ ఉద్యోగి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ వద్దకు వచ్చిన కొందరు రైతులు ఆ ఉద్యోగిని కొట్టారు. మరోవైపు పాస్బుక్ జారీకి రైతులను లంచం అడిగిన ఆ బ్యాంక్ ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు అవంతిపూర్ బడోడియా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ హెచ్ఎల్ రాజోరియా తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.