రంగారెడ్డి : వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కానీ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన రవి.. మైలార్ దేవుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్లో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఓ అమ్మాయితో రవికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను నిరాకరించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ప్రేమికులు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.