సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి అటవీప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మూడురోజుల క్రితమే వీరు చెట్టుకు ఉరివేసుకున్నట్లు భావిస్తున్నారు.
మృతదేహాలు కుళ్లిపోయి కనిపించాయి. యువకుడిని సిరిసిల్ల పట్టణం రాజీవ్నగర్కు చెందిన నామా వేణుగోపాల్గా గుర్తించారు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది.