వనపర్తి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వనపర్తి మండలం గుడిపల్లి రిజర్వాయర్లో దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో ప్రియుడు నరేష్ది నాగర్ కర్నూల్ లోని సంజయ్ నగర్ కాగా, ప్రియురాలు కళ్యాణిది కల్వకుర్తి పట్టణం అని సమాచారం.
నరేష్ కు గతంలోనే వివాహమైంది. ఏడాదిన్నర పాప, భార్య ఉన్నారు. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలంలో లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.