సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు శివారులో లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి ఔటర్ రింగ్రోడ్పై ఇద్దరు డ్రైవర్ల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదం ఘర్షణకు దారితీయడంతో లారీ డ్రైవర్ను మరో లారీ డ్రైవర్ ఇనుపరాడ్తో కొట్టి చంపాడు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.