చండీగఢ్: వాళ్లిద్దరు లివ్-ఇన్ రిలేషన్లో ఉన్నారు. ఇలా చాలా కాలంగా ఉంటున్నారు. అయితే ఏమైందో ఏమో ఒకరోజు ఆ యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన భాగస్వామిని చంపేయాలని నిర్ణయించుకుంది. దీనికోసం ఇంట్లో అతనికి నిద్రమాత్రలు తినిపించింది. అవి తీసుకోవడంతో స్పృహతప్పిన అతన్ని ఆటోలో ఎక్కించుకొని ఊరిబయటకు వెళ్లింది.
అక్కడ ఒక నిర్జన ప్రదేశంలో అతన్ని కిందపడేసి పెట్రోలుపోసి తగలబెట్టింది. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో వెలుగు చూసింది. 2019లో వీళ్లిద్దరికీ పరిచయం అయిందని పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అయితే ఈ హత్యకు కారణాలేంటనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని వారు వివరించారు. ఈ ఘటన అక్టోబరు 16న జరిగినట్లు వెల్లడించారు.