లక్నో: విద్యుత్ లైన్మాన్కు పోలీసులు చలాన్ విధించారు. దీనిపై ఆగ్రహించిన అతడు ఏకంగా పోలీస్ స్టేషన్కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. ఉత్తర ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విద్యుత్ లైన్మాన్ భగవాన్ స్వరూప్, శనివారం హర్దాస్పూర్లో బైక్పై వెళ్తుండగా మోడీ సింగ్ అనే పోలీస్ అధికారి అడ్డుకున్నాడు. బైక్ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించమని అడిగాడు. అయితే బైక్ పత్రాలు తన ఇంటి వద్ద ఉన్నాయని, వెంటనే వెళ్లి తీసుకొచ్చి చూపిస్తానని అతడు చెప్పాడు. వినిపించుకోని ఆ పోలీస్ అధికారి రూ.500 జరిమానా విధించాడు.
మరోవైపు ఈ సంఘటనపై విద్యుత్ లైన్మాన్ భగవాన్ స్వరూప్ ఆగ్రహం చెందాడు. తనకు చలాన్ విధించిన ఆ పోలీస్ అధికారిపై రివేంజ్ తీసుకోవాలని నిర్ణయించాడు. తన సహచరులతో కలిసి ఆ పోలీస్ అధికారి విధులు నిర్వహించే హర్దాస్పూర్ పోలీస్ స్టేషన్కు విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు.
కాగా, తన చర్యను విద్యుత్ లైన్మాన్ భగవాన్ స్వరూప్ సమర్థించుకున్నాడు. ఆ పోలీస్ స్టేషన్కు విద్యుత్ మీటర్ లేదని, అక్రమంగా విద్యుత్ను వినియోగించుకుంటున్నారని అతడు ఆరోపించాడు. ఈ మేరకు మీడియాకు వెల్లడించాడు.