శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ షోపియాన్లోని బాస్కునాచ్ ఇమాంసాహిబ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాద సంస్థ లష్కేరే తోయిబా (LeT)తో సంబంధాలున్న ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులు అదే ప్రాంతంలో దక్కున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. మృతుడిని నౌపోరాకు చెందిన నసీర్ అహ్మద్ భట్గా పోలీసులు గుర్తించారు.
భట్ అనేక ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడని, ఇటీవలనే ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడని కశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్కుమార్ తెలిపారు. దక్షిణ కశ్మీర్ జిల్లా బాస్కునాచ్ ప్రాంతంలో ఉగ్రవాదుల గురించి పక్కాగా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ను ప్రారంభించాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సోదాలు నిర్వహిస్తుండగా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరుపగా.. ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది.