వికారాబాద్ : కుల్కచర్ల మండలం అనంతసాగర్లో చిరుత కలకలం సృష్టించింది. చిరుతపులి దాడిలో రెండు బర్రె దూడలు మృతి చెందాయి. దీంతో అనంత సాగర్ గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంతో ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే భయమేస్తోందని గ్రామస్తులు వాపోయారు.