ములుగు : పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా మందుపాతరలను అమర్చిన మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ ఓఎస్డీ శోభన్ కుమార్ శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.
జిల్లాలోనివెంకటాపురం నూగురు మండలంలోని తిప్పాపురం -పెద్ద ఉట్లపల్లి అటవీ గ్రామాల మధ్య పోలీసులను హతమార్చడానికి ఆరుగురు మిలీషీయా సభ్యులను మందుపాతరలను అమరుస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.
సంఘటనా స్థలం నుంచి రెండు టిఫిన్ బాక్సులు, కార్డెక్స్ వైర్, రెండు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు మిలిషియా సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.