కోట్పల్లి : అవమానం భరించలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మోత్కుపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కుపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ హమీద్(47) శుక్రవారం సాయంత్రం మధ్యాహ్నం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అయితే శుక్రవారం అదే గ్రామానికి చెందిన మందుల రాజు, నాళ్లపురం రాజు అనే యువకులు తాగిన మైకంలో హమీద్తో గోడవపడి, తీవ్రంగా దుర్భాషలాడి కొట్టడం జరిగింది.
దీంతో మనస్తాపం చెందిన హమీద్ ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి పక్రుద్దిన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.