బంజారాహిల్స్ : తన ఇంట్లో పనిచేస్తున్న మహిళలు ఆభరణాలు తస్కరించి ఉంటారని ఓ వృద్దురాలు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ 14లోని నందినగర్ సమీపంలో కే.ఉమాదేవి అనే వృద్దురాలి నివాసం ఉంటుంది.
వృద్దురాలి ఇంట్లో బీరువాలో పెట్టిన ఆరుతులాల బంగారు గాజులు, రెండు తులాల నవరత్న మాల, వజ్రపు ఉంగురం మాయమయ్యాయి. ఈ మేరకు బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో పనిచేస్తున్న ఝాన్సీ, లక్ష్మీ అనే మహిళలపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.