జనగామ చౌరస్తా : ఇటీవల పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ బైకులు చోరీ చేస్తున్న మెదక్ జిల్లా శివంపేట్ మండలం శభాష్పల్లికి చెందిన జోడు ప్రశాంత్ (23), రంగపల్లి ప్రశాంత్ (26), చాపల సంజీవ్ (25) అనే ముగ్గురు నేరస్తులను గురువారం ఉదయం బచ్చన్నపేట రోడ్డు మార్గంలో దొంగతనం కొరకు నిందితులు వస్తుండగా జనగామ అర్బన్ పోలీసులతో పాటు కేయూసీ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 6 ద్విచక్ర వాహనాలు, రూ. 65,897వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిందితులు ముగ్గురు కూడా జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
ఈ ముగ్గురు పీడీ యాక్ట్పై ఇది వరకే జైలుకు వెళ్లి రావడం జరిగిందన్నారు. అనంతరం నిందితులతో పాటు రికవరి చేసిన సొత్తును వెస్ట్జోన్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి ఎదుట హాజరు పర్చడం జరిగిందన్నారు. ఈ ముగ్గురు నేరస్తులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన జనగామ అర్బన్ సీఐ బాలాజీ వరప్రసాద్, టీమ్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్రెడ్డి, కృష్ణ, మహేశ్, రామన్న, కేయూసీ పీఎస్ నుంచి సహకరించిన కానిస్టేబుల్ నర్సయ్య, మోహన్ను డీసీపీ శ్రీనివాస్రెడ్డితో పాటు జనగామ ఏసీపీ కృష్ణ ప్రత్యేకంగా అభినందించారు.