భువనేశ్వర్ : ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ను ఒడిషాలోని రూర్కెలాలో భగ్నం చేసిన పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితులను చత్తీస్ఘఢ్కు చెందిన మలీత్ సింగ్(25), విశాల్ రాయ్ (18), హిమాన్షు దేవాంగన్(25), పంకజ్ దేవాంగన్(22), వికాస్ ఠాకూర్ (23), మిను సింగ్ (21), దినేష్ కుమార్ సాహూ (28), విక్రమ్జిత్ సింగ్ (19), జోగీంద్ర సింగ్ (22)గా గుర్తించారు.
జమునానకి ప్రాంతంలో బెట్టింగ్ సాగుతోందనే సమాచారంతో దాడులు చేసిన రూర్కెలా పోలీసులు బెట్టింగ్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. నిందితులు ప్రస్తుతం జరుగుతున్న ఐపీల్ టోర్నమెంట్ మ్యాచ్ల్లో బెట్టింగ్కు పాల్పడుతున్నట్టు గుర్తించారు. నిందితుల నుంచి పెద్దమొత్తంలో నగదు, 18 మొబైల్ ఫోన్లు, టేబుల్స్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.