అమరావతి : ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములిద్దరూ గంటల వ్యవధిలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం వారి కుటుంబంలో విషాదం నిండుకుంది. కృష్ణా జిల్లా గోపాలపురంలో వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో బాబురావు అనే వ్యక్తి మృతి చెందగా అతడి తమ్ముడు శ్రీను అన్న మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు బైక్పై వెళ్తుండగా శనివారం ఏ కొండూరు మండలం గోపాలపురం వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది . ఈ సంఘటనలో శ్రీను కూడా అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు శ్రీను తిరువూరు ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు . గంటల వ్యవధిలో అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.