న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో దారుణం వెలుగుచూసింది. 20 ఏండ్ల యువకుడిపై కొందరు బెల్టులు, ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేయడంతో బాధితుడు మరణించిన ఉదంతం కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇద్దరు మైనర్లతో పాటు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పాతకక్షల నేపధ్యంలో జరిగిన ఈ హత్యలో నిందితులను దేవన్, శని బాట్లా, అమిత్ అలియాస్ మీట్, ఖాసిం ముల్లా, సమీర్, లక్కీ అలియాస్ టాండా, అభిషేక్లుగా గుర్తించారు.
మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు యువకుడిని చితకబాదడమే కాకుండా ఘటనను కెమెరాలో రికార్డు చేయడంతో ఆ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.