జైపూర్ : తనతో సన్నిహిత సంబంధం కొనసాగించాలని పొరుగున ఉండే ప్రియుడు ఒత్తిడి చేస్తుండటంతో అతడిని వదిలించుకోవాలని ఊపిరిఆడకుండా చేసి కడతేర్చిన మహిళ ఉదంతం జైపూర్లో వెలుగుచూసింది. మృతుడిని 27 ఏండ్ల సుభాష్ కుమావత్గా గుర్తించిన పోలీసులు గురువారం నిందితురాలిని అరెస్ట్ చేశారు. మృతుడు ఫకీరా నగర్లోని అద్దె ఇంట్లో అనుమానాస్పద పరిస్ధితిలో విగతజీవిగా పడిఉన్నాడని పోలీసులు తెలిపారు.
బాధితుడి ఫోన్ను పరిశీలించడంతో పాటు అక్కడున్న ఆధారాలను బట్టి మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమావత్ పొరుగున ఉండే మహిళకు సంబంధించిన పలు వీడియోలు బాధితుడి ఫోన్లో ఉండటంతో ఆమెను ప్రశ్నించగా వ్యవహారం బయటపడింది. కుమవత్ ఆదివారం ఉదయం తన భర్త పనికి వెళ్లిన సమయంలో తమ ఇంటవికి వచ్చాడని కోరిక తీర్చాలని ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని నిందితురాలు పోలీసులకు తెలిపింది.
దీంతో కుమవత్ను ఊపిరిఆడకుండా చేసి హత్య చేశానని, మృతదేహాన్ని కిటికీ వద్ద పడేసి బయటకు వెళ్లానని పేర్కొంది. గత రెండేండ్లుగా కుమవత్తో తనకు వివాహేతర సంబంధం ఉందని ఈ విషయం ఇంట్లో తెలియడంతో అతడికి దూరంగా ఉంటున్నానని మహిళ తెలిపిందని పోలీసులు వెల్లడించారు. మహిళను అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.