ముంబై : అర్ధర్ రోడ్ జైలులో తోటి ఖైదీని కొట్టి ఆపై అతడిని లైంగిక వేధింపులకు గురిచేసిన టీనేజర్ (19)పై కేసు నమోదైంది. వేర్వేరు నేరారోపణలపై కొద్ది నెలలుగా ఇద్దరినీ ఒకే బ్యారక్లో ఉంచగా తోటి ఖైదీ( 20) పై నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.
బాధితుడు జైలు అధికారులకు ఈ విషయం తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిందితుడు తనను బెదిరించాడని బాధితుడు తెలిపాడు. నిందితుడిపై పోలీసులు అసహజ నేరాలు సహా పలు సెక్షన్ల కింద ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ప్రస్తుత చట్టాల ప్రకారం 16 ఏండ్లు పైబడిన పురుష బాధితులపై లైంగిక దాడిని భారత శిక్షా స్మృతి గుర్తించదు. పురుషుడు ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తే దాన్ని లైంగిక దాడిగా పరిగణిస్తుంది. మైనర్ బాలురపై లైంగిక దాడులు పోక్సో కింద లైంగిక వేధింపులుగా పరిగణిస్తారు.