ముంబై : మహారాష్ట్రలోని పుణే జిల్లా పింప్రి చించ్వాద్ పోలీసులు ఆన్లైన్ సెక్స్ రాకెట్ను భగ్నం చేశారు. ఈ దందా నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గరు మహిళలను నిర్వాహకుల చెర నుంచి కాపాడారు.మహిళల పేరిట పలు హోటళ్లలో రూంలు బుక్ చేసి చీకటి దందా నిర్వహిస్తున్నారనే సమాచారంతో హోటల్పై దాడి చేసిన పోలీసులు ముగ్గరు మహిళలను కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు.
నిందితులు మహిళల ఫోటోలను కస్టమర్లకు పంపి మహిళల పేర్లతో హోటల్ రూంలను బుక్ చేసి విటులను రప్పిస్తున్నారని సమాచారం రాగా పోలీసులు రంగంలోకి దిగి ముఠా ఆట కట్టించారు. ఈ రాకెట్ను నిర్వహించే వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ డెకాయ్ ఆపరేషన్లో భాగంగా కస్టమర్గా పరిచయం చేసుకున్నాడు. చించ్వాద్లోని ఓ హోటల్కు రావాలని అతడిని సెక్స్ రాకెట్ నిర్వాహకకుడు కోరాడు.
దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇవ్వగానే హోటల్పై దాడి చేయగా అక్కడున్న ముగ్గురు మహిళలను కాపాడి రెస్క్యూ హోంకు తరలించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మహిళలతో నిర్వాహకులు బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ రాకెట్కు సంబంధించి ముగ్గరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.