భువనేశ్వర్ : డ్రైవర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్త అడ్డుతొలగించుకునేందుకు లక్ష రూపాయలకు కాంట్రాక్ట్ హంతకుడితో ఒప్పందం చేసుకుంది. ఈ ప్లాన్ బెడిసికొట్టడంతో భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిషాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాధితుడిని మంచేశ్వర్ రైల్వే వర్క్షాప్లో సీనియర్ ఇంజనీర్గా పనిచేసే వినాయక్ బెహెరాగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్తో భార్య వ్యవహారం తెలిసిన వినాయక్ ఆమెతో ఘర్షణకు దిగాడు. భర్త వారించడంతో ఆగ్రహానికి లోనైన మహిళ ఎలాగైనా భర్త అడ్డుతొలగించుకోవాలని కాంట్రాక్ట్ కిల్లర్తో రూ లక్షకు ఒప్పందం కుదుర్చుకుంది. ఏప్రిల్ 16న అశోక్, జితేంద్ర మరికొందరు అనుచరులు మంచేశ్వర్లోని స్పోర్ట్స్ కాలేజ్ వద్ద ఈవెనింగ్ వాక్ చేస్తున్న వినాయక్పై ఐరన్ రాడ్తో దాడి చేశారు.
అటుగా వెళుతున్న వారు గాయాలతో పడిఉన్న వినాయక్ను ఆస్పత్రిలో చేర్చారు. వినాయక్ ఫిర్యాదుపై నిందితుడు అశోక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ, కాంట్రాక్ట్ కిల్లర్ పరారీలో ఉన్నారు. మహిళతో పాటు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని భువనేశ్వర్ డీసీపీ ఉమాశంకర్ తెలిపారు.