లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో బాలిక(15)ను లైంగికంగా వేధించిన వ్యక్తి కేసును వాపస్ తీసుకోనందుకు బాధితురాలిపై రాళ్ల దాడికి తెగబడి ఆమెకు పేడ పూసిన ఘటన ఆదివారం దియోరియా జిల్లాలో వెలుగుచూసింది.
నిందితుడు యోగీంద్ర యాదవ్ జనవరి 26న తనను లైంగిక వేధింపులకు గురిచేయగా పోలీసులకు పిర్యాదు చేశానని, ఇప్పుడు ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని బాలిక ఆరోపించింది. తాజా ఫిర్యాదుపై నిందితుడు యాదవ్ను పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు యాదవ్ను అరెస్ట్ చేశామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని సీఐ కేసీ జలజీత్ పేర్కొన్నారు.
ఇక ఆదివారం బాలిక ఇంటి వద్ద ఉండగా నలుగురు యువకులు ఆమెపై రాళ్లతో దాడి చేశారు. ఆమె నోరు మూసి ముఖంపై ఆవు పేడను పూశారు. బాధితురాలిని తీవ్రంగా హింసించిన నిందితులు ఆపై పరారయ్యారు. బాలికను కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.