న్యూఢిల్లీ : తొమ్మిదేండ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా పక్కనే ఉన్న ఫ్యాక్టరీ లోపలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి (41) ఉదంతం కలకలం రేపింది. ఢిల్లీలోని న్యూ సీలంపూర్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. మానసిక వైకల్యంతో బాధితురాలు బాధపడుతోందని పోలీసులు తెలిపారు. శుక్రవారం 11.15 గంటలకు పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్ధలానికి చేరుకుని బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జేపీసీ ఆస్పత్రికి తరలించారు.
బాలికపై లైంగిక దాడి జరిగిందని వైద్య పరీక్షల్లో వెల్లడైంది. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని బిహార్లోని బెగుసరైకి చెందిన మహ్మద్ షాజిద్గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఇంటి పక్కనే ఉన్న చిన్న ఫ్యాక్టరీలో షాజిద్ పనిచేస్తుంటాడు.