నోయిడా : యూపీలోని నోయిడాలో దారుణం జరిగింది. అన్నం పెట్టలేదనే కోపంతో భార్యను ఊపిరిఆడకుండా చేసి ఉసురుతీసిన భర్త ఉదంతం నోయిడాలోని సెక్టార్ 141లో వెలుగుచూసింది. నిందితుడిని ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన సోను కుమార్గా గుర్తించారు.
సోను కుమార్ నోయిడాలో భార్య శ్రద్ధా దేవి (33)తో కలిసి నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన సోను రోజూ మద్యం మత్తులో భార్యతో గొడవపడేవాడు. రోజూలాగే సోమవారం మద్యం తాగి ఇంటికి వచ్చిన సోను అన్నం పెట్టాలని భార్యను కోరాడు. ఏదో పనిలో ఉన్న భార్య సమయానికి ఆహారం పెట్టకపోవడంతో కోపంతో ఊగిపోయిన సోను భార్య గొంతుకు శాలువా బిగించి ఊపిరిఆడకుండా చేసి ఉసురుతీశాడు.
బాధితురాలి అరుపులతో స్ధానికులు అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. మహిళ సోదురుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నోయిడా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.