రాంచీ : తనను ప్రేమించేందుకు నిరాకరించిందనే ఆగ్రహంతో యువతి (19)కి నిప్పుపెట్టిన వ్యక్తి ఉదంతం జార్ఖండ్లోని దుంకాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మరణించింది. మృతురాలికి న్యాయం చేయాలని కోరుతూ యువతి బంధువులు, స్ధానికుల నిరసనతో ఆ ప్రాంతంలో అధికారులు 144వ సెక్షన్ విధించారు.
భాదితురాలు ఇంట్లో నిద్రిస్తుండగా నిందితుడు షారుక్ కిటికీ లోంచి కిరోసిన్ చల్లి నిప్పంటించాడని పోలీసులు తెలిఆరు. పన్నెండో తరగతి చదువుతున్న యువతిని ప్రాధమిక చికి్త్స అనంతరం రాంచీలోని రిమ్స్కు తరలించారు. 90 శాతం కాలిన గాయాలైన బాధితురాలు రిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం మద్యాహ్నం మరణించింది.
బాదితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడు పదిరోజుల కిందట తనకు పలుమార్లు ఫోన్ చేసి తనతో స్నేహం చేయాలని కోరాడని, తనతో సన్నిహితంగా మెలగకుంటే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.