కోల్కతా : భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో ఆమె గొంతుకోసి కడతేర్చిన భర్త ఉదంతం కోల్కతాలో వెలుగుచూసింది. నిందితుడిని పల్టా-బరక్పోర్ ఎయిర్ఫోర్స్ క్యాంప్లో పనిచేసే రక్షణ శాఖ ఉద్యోగి అమరఖ్ లాల్ చౌధురి (42)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని శనివారం జవహర్ కాలనీలోని అతడి ఇంటి నుంచి అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు రంజనాదేవి (32) బెడ్రూంలో రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉంది. ఆమె గొంతు, మణికట్టు వద్ద గాయాలయ్యాయి. నేరం జరిగిన రోజు నిందితుడు తన మైనర్ కూతుళ్లను పార్క్కు తీసుకువెళ్లాడు. తాను పార్క్ నుంచి తిరిగి రాగా భార్య రక్తపుమడుగులో పడిఉండటం చూసి షాక్కు గురయ్యానని నిందితుడు నమ్మబలికాడు.
ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు నిందితుడు భార్యతో గొడవపడ్డాడని పెద్దకూతురు తెలిపిందని పోలీసులు వెల్లడించారు. పార్క్కు వెళ్లే ముందే నిందితుడు భార్యను కడతేర్చిఉంటాడని తాము అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. వేరొకరితో సంబంధం ఉందనే అనుమానంతో నిందితుడు భార్యను నెట్టివేసి తీవ్రంగా గాయపరిచాడని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని డీసీపీ నార్త్ జోన్ శ్రీహరి పాండే వెల్లడించారు.