హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల చేతిలో మరో యువకుడు మోసపోయాడు.ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. యువకుడు కొద్దిరోజులక్రితం ఆన్లైన్ ఓ వస్తువు కొనుగోలు చేశాడు. కాగా అది నచ్చకపోవడంతో రిటర్న్ చేయాలనుకున్నాడు. ఆన్లైన్లో కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ వెతికి డయల్ చేశాడు. కాగా అవతలి వ్యక్తి కంపెనీ ఎగ్జిక్యూటివ్గా పేర్కొంటూ నగదు రిఫండ్ చేయనున్నట్లు నమ్మించాడు. ఎనీ డెస్క్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా చెప్పి అకౌంట్ను హాక్ చేశాడు. మొత్తం రూ.6.5 లక్షలు అపహరించారు. నగదు మాయమైనట్లుగా గుర్తించిన పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.