మేళ్లచెర్వు : ఇంటి దగ్గర ఆరుబయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారి పాముకాటుకు గురై చనిపోయిన సంఘటన మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి గుండా పున్నారెడ్డి దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె. గురువారం కుమార్తె పావని (7)సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటుండగా ఏదో కుట్టినట్లు అనిపించదని తాతతో చెప్పింది. వచ్చి వెతికినప్పటికీ ఏమి కనిపిచంలేదు. కాసేపటికీ పాప నోటి నుంచి నురగరావటంతో మేళ్లచెర్వులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హుజూర్నగర్ వెళ్లాలని సూచించారు.
దీంతో అక్కడికి వెళ్లి వైద్యం అందిస్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. తమ కళ్ల ఎదుట అప్పటివరకు తిరగాడిన కూతురు విగత జీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.