మహేశ్వరం : కట్టుకున్న భార్యను ఉరివేసి హత్యచేసిన భర్తను మహేశ్వరం పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలక్రిష్ణారెడ్డి, మహేశ్వరం సీఐ మధుసూధన్ తెలిపిన వివరాల ప్రకారం..
గత నెల 28 భార్యపై అనుమానంతో అలువాల నర్సింహ్మ మద్యం మత్తులో భార్యను కరెంటు వైర్ గొంతుకు బిగించి చంపేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని నమ్మించాడని వారు అన్నారు. పోలీసులు అనుమానంతో ఆమె కుంటుంబ సభ్యులతో ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేపట్టడంతో అతనే చంపినట్టు తేలిందన్నారు.
నేరం ఒప్పుకోవండంతో బుధవారం మహేశ్వరం పోలీసులు అతనిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు