కందుకూరు : ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో దొంగలు ఇంటి తాళాలను పగులగొట్టి నగదుతో పాటు బంగారు ఆభరణాలు దొంగిలించి పరారయ్యారు. సంఘటన సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన చీమల సురేష్ ముదిరాజ్, మంజుల దంపతులు ఆదివారం రాత్రి మంజుల సోదరి నిచ్చితార్థానికి వెళ్లారు.
విషయం పసిగట్టిన దొంగలు ఆదివారం రాత్రి సమయంలో ఇంటి తాళాన్ని పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఆల్మారా తాళం తీసి అందులోని 1లక్షా 48వేల రూపాయలతో పాటు ఆరతులం బంగారం, 3తులాల వెండిని ఆపహరించి పరారయ్యారు. సోమవారం ఉదయం ఇంటి తాళం తీసి ఉండడంతో పక్కంటి వారు మంజుల. సురేష్ లకు సమాచారం అందించారు.
హుటహుటినా ఇంటికి వచ్చిన వారు ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ క్రిష్ణంరాజు, ఎస్సై శ్రావణ్ సంఘటన స్థలానికి చెరుకొని డాగ్ స్క్యాడ్తో పాటు క్లూస్ టీంను రప్పించి సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ జరుపుతున్నట్టు సీఐ క్రిష్ణంరాజు తెలిపారు.