బడంగ్పేట, పహాడీషరీఫ్ : ఉరేసుకుని ఓ హిజ్రా మృతి చెందిన ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో నివాసముంటున్న స్వప్న (24) అనే హిజ్రా మూడు నెలల క్రితం నల్లగొండ జిల్లాకు చెందిన నిశాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
నందనవనంలోనే వారు సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తన ఊరికి వెళ్లిన నిశాంత్ తిరిగి రాలేదు. దీంతో మనస్థాపానికి గురైన స్వప్న సోమవారం ఉదయం 9 గంటలకు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితురాలు ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.