లక్నో : డ్రగ్ మాఫియాకు యూపీ అడ్డాగా మారింది. ముజఫర్నగర్లో రూ 1300 కోట్ల విలువైన 210 కిలోల హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని షహీన్బాగ్లో బయటపడిన నార్కోటిక్స్ రాకెట్తో యూపీలో వెలుగుచూసిన తాజా డ్రగ్ దందాకు సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. గుజరాత్ ఏటీఎస్, ఎన్సీబీ, డిల్లీ పోలీస్ స్పెషల్ సెల్తో కూడిన సంయుక్త ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.
ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం కీలక సమాచారం ఆధారంగా ముజఫర్నగర్లోని కిద్వాయి నగర్ ప్రాంతంలో నిఘా, దర్యాప్తు ఏజెన్సీలు సోదాలు నిర్వహించాయి. అనుమానితుడిని హైదర్గా గుర్తించారు. హైదర్ పొరుగున ఉండే వ్యక్తి ఇంటి నుంచి పెద్దసంఖ్యలో డ్రగ్స్ను అధికారులు సీజ్ చేశారు.