కరోనా పాజిటివ్ అని చెప్పి ప్రియురాలితో సరసాలు

ముంబై : కంటికి కనిపించని కరోనా వైరస్ పేరుతో ఎందరో ఎన్నెన్నో నాటకాలు ఆడుతున్నారు. కరోనా సోకిందని భార్యకు చెప్పి.. ప్రియురాలితో సరసాలాడుతున్నాడు ఓ భర్త ఎట్టకేలకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన 28 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి జులై 24న తన భార్యకు ఫోన్ చేశాడు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, బతకలేనని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో కంగారు పడ్డ భార్య తన సోదరుడి సహాయం తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అతని బైక్, హెల్మెట్, బ్యాగు, ఇతర వస్తువులు వశీ సెక్టార్ 17లో లభ్యమయ్యాయి. అయినప్పటికీ తాను ఎక్కడ వెళ్లాడు అనేది పోలీసులకు అంతు చిక్కలేదు. అయితే అతను భార్యకు ఫోన్ చేసిన రోజే.. 100కు రెండుసార్లు డయల్ చేశాడు. ఆ నంబర్ ఆధారంగా అతని ఫోన్ లోకేషన్ను గుర్తించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తన ప్రియురాలితో అతను ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని సెప్టెంబర్ 15న ముంబైకి తీసుకువచ్చారు పోలీసులు. ప్రియురాలితో తన భర్త ఉన్నాడని తెలిసి భార్య షాక్కు గురైంది.
తాజావార్తలు
- దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి ఇతనే.. వీడియో
- తెలుగు మహాకవి గురజాడను గుర్తు చేసిన మోదీ
- రాష్ర్టంలో కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తి ఈమెనే..
- చనిపోయిన పెంపుడు శునకానికి ఎంత గొప్ప సంస్కారం..!
- రష్యా ఎస్-400 మిస్సైల్ కొనుగోళ్లపై అభ్యంతరం
- లాక్డౌన్తో ప్రాణాలను కాపాడుకున్నాం : ప్రధాని మోదీ
- తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు